Wednesday, September 15, 2010

తెలుగు వెలుగులేవి?(telugu velugulevi?)

 ఏభాషా అంత తేలికగా వాగ్వ్యవహారం నుంచి జారిపోదు. సువ్యవస్థితమైన భాష ఏర్పడడానికి ఎంతకాలం పడుతుందో, అంతకంటే ఎక్కువ కాలమే జన వ్యవహారం నుంచి భాష మృగ్యమైపోవడానికి పడుతుంది. ఈ దశలో పతనం కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. నేడు మన తెలుగు భాష దుస్థితికి

తెలుగులో తొలి రచన

సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగులో తొలి ఇతిహాసం. నన్నయకి ‘ఆదికవి’ అనే బిరుదు అనంతరకాలంలో వచ్చిందే. మారన ‘‘ఆంధ్ర కవితా గురుడు’’ అన్నాడు. తిక్కన ‘‘ఆంధ్ర కవిత్వ విశారదుడు’’

తెలుగులో తోలి రామాయణం (First ramayana in telugu)

గోన బుద్ధారెడ్డి రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి రామాయణం. ఇతడు క్రీశ 1210 ప్రాంతంలో జన్మించినవాడుగా చె ప్తారు. ఈ రంగనాథ రామాయణం కొంతకాలం ఎవరు రాసారు? అనే అంశంపై

అంకెలు , సంఖ్యలు అర్థ గర్భితమైన శ్లోకాలు (How our ancestors gave us the knowledge about the number system?)

పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్ళకి బొత్తిగా భయం లేదని గతంలో ఒకసారి చెప్పేను. పెద్ద పెద్ద సంఖ్యలని కుదించి చిన్న చిన్న మాటలలో చెప్పడంలో మన పూర్వీకులు దిట్టలు. సంఖ్యలని చిన్న చిన్న మాటలలో కుదించి చెప్పవలసిన అవసరం ఎందుకొచ్చిందో ముందు చెబుతాను.

Tuesday, September 14, 2010

Sneha geetham kavitha

ప్రకృతి ఆహ్లాదంతో పరవశించే నా హృదయం,
*పరుగులు తీస్తుంది చూడాలని నీ చిన్న రూపం,
కోకిలమ్మ సరాగాలతో కమనీయమైన నా శోత్రం
*వినాలంటుంది నీ తియ్యని రూపం

తెలుగు సాహిత్యం దశలు(ages in telugu literature)

ప్రాచీన సాహిత్యం తెలుగు  అమరావతి స్తూపంలో గల '' నాగబు'' శబ్దం తో ప్రారంభం అయ్యింది..నన్నయ్య ముందున్న కాలాన్ని " ప్రాజ్నన్నయ యుగం" అని అంటారు.      అంటే పదకొండవ శతాబ్దికి ముందున్న కాలం నుండి తెలుగు ఉంది..తెలుగు భాషా సాహిత్యాలను తెలుసుకోవడానికి ప్రధానంగా శాసనాలే ఆధారాలు...ఇతర భాషల్లో వెలువడిన గ్రందాలవల్ల, సాహిత్యం వల్ల కూడా అన్నాతి వాఘ్మయ స్ధితిగతులు తెలుసుకోవచ్చు..ప్రాకృత భాషలో హాలుని గాదా సప్తశతిలో తెలుగు మాటలున్నాయి.. తెలుగు భాషలో పాటలున్నట్లు తెలియజేయబడింది...కావున మనకు తెలిసినంతవరకు క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటికే తెలుగు వాంగ్మయం  ఉందన్న మాట. శాతవాహనులు, ఇక్ష్వాకులు, మొదలైన వారు శాసనాలను సంస్కృత ప్రాక్రుతాలలో వేయించినా ఉర్ల పేర్లు, మనుషుల పేర్లు, మొదలైనవి తెలుగువారిని గుర్తుచేస్తాయి.. రేనాటి చోళులు, తూర్పు చాళుక్యులు మదలైనవారు తెలుగులో శాసనాలను వేయించారు. .మొత్తం మీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి.. శాసన కవిత వాడుకలో ఉండేది.. తెలుగు భాష జనవ్యవహారంలో బాగా ఉంది. క్రీ. పూ..200 నుండి 6 వ శతాబ్దం దాకా ప్రారంభ దశ గాను, 6నుండి 9  వరకు వికాస దశ గాను 9  నుండి సాహిత్య వికాస దశ గాను చెప్పవచ్చు..
ఇక ఆధునిక సాహిత్యం విషయానికి వస్తే నవ్య సాహిత్యం, అభినవ సాహిత్యం, అనికూడా అంటారు.  కానీ ఆధునికం అనే పదమే స్థిరపడిపోయింది.. అయితే ఆధునికం కాలానిదా? లేక స్వభావానిదా? అనే చర్చకు వస్తే ఆధునిక భావాలు కలిగినదే ఆధునిక కవిత్వం అవుతుందని, అంటే ఆధునిక కాలంలో వెలువడినంతమాత్రాన పురాణాలు, పద్యకావ్యాలు లాంటివి ఆధునిక సాహిత్యం ఎలా అవుతాయి.? అని ప్రశ్నిస్తున్నారు.. అందుకే "ఆధునిక" అనే పదం కాలానికే కాకుండా స్వభావానికి కూడా వాడుతున్నాము.. 19 వ శతాబ్దం నుండి వెలువడిన సాహిత్యమే ఆధునిక సాహిత్యం అని చెప్పుకోవచ్చు..
రాను రాను సృష్టి క్రమంలో సృష్ట్యాది కాల నిర్ణయంలో భిన్న రాజచరిత్ర నిర్ణయంలో సంఘ ధర్మ నీతులలో ఆర్ధిక రాజకీయాలలో, సారస్వత పదాలలో ఒక విశిష్టమైన సంస్కారంతో కూడిన సిద్దాంతాల మీద నుండి మన జాతి నడిచింది.. ఇప్పటికి మనపై ఆంగ్లేయులు ప్రభావం ఉండటం చేత మన భాష పట్ల మనకు అభిమానం పోయింది. అయినా మన సాహిత్యానికి ఎందరో స్పూర్తి దాతలు, ఎందరెందరో కవిపండితులు,  రచయిత, రచయిత్రులు తమ అత్యున్నత సాహిత్యంతో సమాజ సేవ చేస్తూనే ఉన్నారు. వారందరినీ ఆదికవి నన్నయ్య నుండి... నేటి నారాయణ  రెడ్డి గారి  వరకు తెలుగు సాహిత్యం.. విరాజిల్లుతునే ఉంది.. తేనెలూరు తెలుగు భాషకు ఎల్లలు లేవు క్రీ.పూ 200 నుండి ఆరవ శతాబ్దం  వరకు ప్రారంబ దశగాను తొమ్మిది  నుండి సాహిత్య దశ గాను చెప్పవచ్చు '

Nee gnapakam kavitha

వేకువఝామున పిల్ల తెమ్మెర నువ్వే
నా ముంగిలి తాకే తొలి సూర్యకిరణం నువ్వే
నా కిటికిలోంచి తొంగిచూసే మల్లె పరిమళం నువ్వే
గోధూళి వేళ ఆకాశపు అరుణిమ నువ్వే
రాత్రంతా నన్నల్లరి పెట్టే వెన్నెల నువ్వే
కానీ నేనే
నీకేమీ కాను....