Wednesday, September 15, 2010

తెలుగులో తోలి రామాయణం (First ramayana in telugu)

గోన బుద్ధారెడ్డి రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగులో తొలి రామాయణం. ఇతడు క్రీశ 1210 ప్రాంతంలో జన్మించినవాడుగా చె ప్తారు. ఈ రంగనాథ రామాయణం కొంతకాలం ఎవరు రాసారు? అనే అంశంపై వాదోపవాదాలు జరిగాయి. మొదట వ్రాత ప్రతులలో ‘రామాయణము’ అనే పేరున్నదనీ అనంతరకాలంలోనే రంగనాథ రామాయణం అనే పేరు వచ్చిందని రాళ్లపల్లి, మల్లంపల్లి, సి.పి.బ్రౌనులు అభిప్రాయపడ్డారు. ఇది ద్విపద ఛందస్సులో రాయబడింది. కాబట్టి రంగనాథ రామాయణం ద్విపదలో రాయబడిన తొలి రామాయణం కూడా!
రంగనాథ రామాయణం జన సామాన్యంలో ప్రచారం పొందింది. ద్విపదలో రాయడంవల్ల గానయోగ్యమైంది. వాల్మీకి రామాయణం మూలమైనా స్వతంత్రతో బుద్ధారెడ్డి మార్పులు చేర్పులు చేసాడు. ఇద దేశీయ రచన కాబట్టి జానపదులు పాడుకునేవారని, పురాణ పఠనానికి అనువుగా వుందనీ పేర్కొన్నారు.
‘‘్భమి గవీంద్రులు బుధఉలును మెచ్చ రామాయణంబు పురాణ మార్గమున’’ శ్రీరామ చరిత్రమును ఒప్పచెప్పెద అన్నాడు. అయితే వాల్మీకి రామాయణంలో లేనివాటిని చాలా బుద్ధారెడ్డి కల్పించాడు. అహల్యపై మనసుపడిన ఇంద్రుడు కోడియై కూసినట్టు సంస్కృత రామాయణం లేకున్నా బుద్ధారెడ్డి కల్పించాడు. ఈ మార్పు నచ్చిన ఓ కవి ఏకంగా ఇదే సంఘటన ఆధారంగా ‘అహల్యాసంక్రందనం’ అ ప్రబంధమే రాసేసాడు. జానపదుల కథలనుంచి కొన్ని సన్నివేశాలు స్వీకరించి ప్రజల కథనాలకి బుద్ధారెడ్డి ప్రాధాన్యమిచ్చాడు. రావణుడ్ని ఉదాత్తునిగా, శూరునిగా వర్ణించాడు. ఈ ప్రతినాయకుడు రాముని విలువిద్యా కౌశలాన్ని ఇలా కీర్తిస్తాడు.
‘‘నల్లవో రఘురామ! నయనాభిరామ! విల్లువిద్యగురువ! వీరావతార!
....బాపురే! రామభూపాల! లోకములు నీపాటి విలుకాడు
నేర్చునే...’’ పగవారి నేర్పును మెచ్చుకొనే తత్వం మనకి గుణపాఠం గదా! రాముడు సీతను ఎడబాసినప్పుడు ఎలా భావించాడో గొప్పగా వర్ణించాడు బుద్ధారెడ్డి-
‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె
నిది పర్ణశాలయై యిప్పుడుతోచె
నిది నాకు దపయని ఇప్పుడు తోచె
నిదినాకు దుఃఖమని యిప్పుడు తోచె’’
ఇదీ దాంపత్య వైభవం అంటే! ఆచార్య జి.నాగయ్యగారి మాటలు గుర్తుంచుకోదగినవి; ‘‘తెలుగు సాహిత్యమున రంగనాథ రామాయణము మనకొక ప్రత్యేక స్థానమున్నది శివకవుల ఆవేశమిందు లేకపోవవుట, ప్రబంధ కవుల పదబంధములకిది దూరముగా నుండుట అను రెండు గుణముల వలన రంగనాథ రామాయణం కావ్య గౌరవము ఇనుమడించుచున్నది’’.



No comments:

Post a Comment