తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందఱో పెద్దలు పద్యాలు రాసి ఉంటారు, అయితే శాసనాలు లభించిన మేరకు యీ పద్యం మొదటిది గ ఆర్యులు చెప్తూ ఉంటారు.
యీ తరువోజ రాసిన మహానుభావునికి నమస్కరాలర్పిస్తూ మనం పద్య రచనకు సాగుదాం.
No comments:
Post a Comment